అందరికీ ఇష్టమైన క్రికెట్లో కూడా ఇలా తెర వెనక కష్టపడుతూ గుర్తింపు సంపాదించుకొని వారు చాలామంది ఉన్నారు.. క్రికెటర్లు మైదానంలో బరిలోకి దిగుతూ అద్భుతంగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తూ ఉన్నారు అంటే... అంతకుముందు వాళ్ళు నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేసి ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కోచింగ్ సిబ్బందితోపాటు త్రోడౌన్ స్పెషలిస్టులు కూడా అటు ఆటగాళ్ల బ్యాటింగ్ మరింత మెరుగుపడేందుకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటారు. ఇక ఇలా ఎక్కడ చర్చకు రాని త్రోడౌన్ స్పెషలిస్టులు బాగా కష్టపడినప్పుడే బ్యాట్స్మెన్లు కూడా మైదానంలో రాణించగలరు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే టీమ్ ఇండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో ఉన్న త్రోడౌన్ స్పెషలిస్టులను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పాలి. రఘు, నువాన్, దయ వీరి పేర్లు ముఖాలు మనమంతా గుర్తుంచుకోవాలి అంటూ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే వీరందరూ కూడా మా విజయం వెనుక ఎంతో కృషి చేసిన వాళ్లు అంటూ చెప్పుకొచ్చాడు. వీళ్లు టీమిండియా విజయం వెనక బయటకి కనిపించిన హీరోలని.. ఇక టీమ్ ఇండియాకు వారి సహకారం నమ్మశక్యం కాని విధంగా ఉంటుంది అంటూ ప్రశంసలు కురిపించాడు విరాట్ కోహ్లీ.