గత కొంతకాలం నుంచి విరాట్ కోహ్లీ అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ మ్యాచ్లో బరిలోకి దిగాడు అంటే చాలు ఇక అతను బ్యాట్ నుంచి భారీ స్కోరు రావడం ఖాయమని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇక అభిమానుల అంచనాలను నిలబెడుతూ ఇటీవల శ్రీలంకతో జరిగిన మొదటి మూడవ వన్డే మ్యాచ్లలో కూడా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.


 దీంతో సెంచరీల కింగ్ ఇస్ బ్యాక్ ఇక అతన్ని ఆపే వారే లేరు అంటూ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఇక శ్రీలంకతో వన్ డే సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ అదరగొడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు అని చెప్పాలి. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఇక క్లీన్ బౌల్డ్ అయ్యి నిరాశపరిచాడు.  అది కూడా స్పిన్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోవడం అటు అభిమానులకు అస్సలు రుచించడం లేదు అని చెప్పాలి.


 అయితే విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్లో అవుట్ కావడం గురించి అటు సునీల్ గవాస్కర్  అసంతృప్తి వ్యక్తం చేశాడు. శాంట్నర్ వేసిన స్ట్రెయిట్ డెలివరీని ఆడటంలో విఫలం కావడం సరికాడంటూ వ్యాఖ్యానించాడు. వికెట్ల లైన్ కు లోపలికి విరాట్ కోహ్లీ ఆడటంతోనే ఆ బంతికి వికెట్ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాక్ ఫుట్ వేసి ఆడేందుకు ప్రయత్నించాడు. అదే ముందుకు ఆడి ఉంటే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే వాడు. అదేమీ మరి వికెట్ల ముందు పడిన బంతి కాదు కానీ కాస్త టర్న్ అయ్యి విరాట్ కోహ్లీ బౌల్డ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ సునీల్ గవాస్కర్  చెప్పుకోవచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: