గత కొంతకాలం నుంచి టీమిండియాలో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న  శుభమన్ గిల్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటికే తన ఆట తీరుతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ తానే అని నిరూపించుకున్న శుభమన్ గిల్.. ఇక ఇటీవల వచ్చిన అవకాశాలను ఒడిసి పట్టుకొని తన బ్యాట్ తో చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక కీలకమైన బ్యాట్స్మెన్లు అందరూ కూడా చేతులెత్తేసిన సమయంలో ఇక అతను మాత్రం ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు అని చెప్పాలి.


 న్యూజిలాండ్ బౌలర్లు ఎన్ని వైవిధ్యమైన బంతులను సందించినప్పటికీ.. అటు క్రీజ్ లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోని ఒక వైపు నుంచి వికెట్లు పడుతున్నా కూడా అతను ఎక్కడ భయపడకుండా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల సాధించిన డబుల్ సెంచరీ తో ఇక ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు గిల్. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు గిల్ పై ప్రశంసల వర్షం కురిపించారు అని చెప్పాలి. ఇక ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు రమిజ్ రాజా సైతం ప్రసంసించాడు.


 ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించిన శుభమన్ గిల్ ను చూస్తే.. అతను మినీ రోహిత్ ను తలపిస్తున్నాడు అంటూ రమిజ్ రాజా ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తీరు ఎంతో అద్భుతంగా ఉంది. ఇక పరిస్థితులకు తగ్గట్టుగా అతను బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక భవిష్యత్తులో అతని ఆటతీరు మరింత మెరుగవుతుంది అంటూ రమిజ్ రాజా చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లో భారత ఆట తీరు అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే ఇక భారత ఆటగాళ్ల గురించి రమిజ్ రాజా ఇలా పాజిటివ్ గా మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: