అయితే అయినప్పటికీ యువ ఆటగాళ్లను పక్కనపెట్టి ఇక అనుభవం ఉన్న శిఖర్ ధావన్ కు కొన్ని అవకాశాలు ఇచ్చింది బీసీసీఐ. కానీ శిఖర్ ధావన్ మాత్రం ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో ఇక యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసిన బీసీసీఐ సెలెక్టర్లు ఇక అనుభవం ఉన్న శిఖర్ ధావన్ ను జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోవడం లేదు అని చెప్పాలి. దీంతో గత కొంతకాలం నుంచి టీమిండియాలో కనిపించకుండా పోయాడు. దీంతో అతనికి మళ్ళీ టీం ఇండియాలో చోటు దక్కుతుందా లేదా అనే విషయంపై అభిమానులు కూడా ఆందోళనలో మునిగిపోయారు.
అయితే టీమిండియా వన్డే జట్టులో చోటు కోల్పోవడం పై సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇటీవల స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను అత్యుత్తమంగా ఆడినప్పటికీ తనకంటే మరొకరు మెరుగ్గా ఆడారని చెప్పుకొచ్చాడు. అందుకే తనకు టీంలో ప్లేస్ దక్కడం లేదు అంటూ తెలిపాడు. అయితే ఎప్పటికైనా తిరిగి మళ్లీ భారత జట్టులోకి వస్తాను అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు అనేవి సహజమే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సమయం అనుభవం ఇక ఏ విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్న విషయాన్ని నేర్పుతాయి అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు..