అరబ్ దేశాల్లో మతానికి సంబంధించి వివాదాలు చెలరేగడంతో ఈ అబ్రహామి మతం మొదలైందంటా.. ఈజిప్టులో మత ఐక్యత కోసం ప్రారంభించిన ఈజిప్టు ఫ్యామిలీ హౌజ్ పదో వార్షికోత్సవం సందర్భంగా అత్యున్నత ఇమామ్ అల్-హజిహత్ తయ్యబ్ అబ్రహామీ మతాన్ని విమర్శించడంతో మతానకి సంబంధించిన చర్చ తీవ్రమైంది. అబ్రహామీ మతం అధికారికంగా ఉనికిలోకి రాకపోయినా.. ఆ మతానికి పునాదులు వేసినట్టుగాని, ఆ మతానికి సంబంధించిన అనుచరులు ఉన్నట్టుగా లేదని తెలుస్తోంది. దీంతో పాటు ఆ మతానికి చెందిన ఏ మత గ్రంధాలు కూడా అందుబాటులో లేవని సమాచారం. ఈ క్రమంలో వ్యక్తం అయిన ప్రశ్నతో క్రిస్టినాయిటీ, జుడాయిజం, ఇస్లాం మతం కలిపి ఇబ్రహామీ మతం పుట్టుకొస్తుందని తెలుస్తోంది.
అయితే, ఇప్పుడు ఇమామ్ ఈ మతానికి సంబంధించి ఎందుకు మాట్లాడారు అనే చర్చ నడుస్తోంది. క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాం మతాలను కలిపేయాలనే కోరికతో పిలుపునిచ్చే వాళ్లు వస్తారు. అన్ని చెడల నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతారని, అలాంటి వాళ్లను నమ్మొద్దని ఇమామ్ చెప్పాడు. అయితే, ఈ మతం ప్రజల మధ్య మత విశ్వాల మధ్య కొత్త వివాదాలకు దారి తీస్తుందని పలువురు భావిస్తున్నారు. ఈ మతానికి ఇజ్రాయేల్, యూఎస్ను కూడా లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చూడాలి.