అమెరికా ఫార్మా దిగ్గ‌జ సంస్థ ఫైజ‌ర్ గుడ్ న్యూస్ తెలిపింది. క్రిస్మస్ లోగా టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా, యూకే ఫార్మా సంస్థలు గుడ్ న్యూస్ అందించ‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్యక్త‌మ‌వుతోంది. తమ వ్యాక్సిన్ 95 శాతం సమర్థంగా పనిచేస్తోందిన వెల్లడించిన యూఎస్ ఫార్మా దిగ్గజ ఫైజర్.. క్రిస్మ‌స్‌లోగానే పంపిణీని ఆరంభించనున్న‌ట్లు కూడా తెలిపింది. ఇదిలా ఉండ‌గా అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్‌టెక్ కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాల్లోనూ మంచి ఫలితాలు రాబట్టడంతో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ఆ సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకున్నారు.


 దీన్ని డిసెంబరులో యూఎస్ఎఫ్డీఏ సలహా కమిటీ సమీక్షించనున్నట్లు సమాచారం. మూడో దశ క్లినికల్ పరీక్షల్లోనూ 95 శాతం ఫలితాలను సాధించినట్లు ఇటీవలే ఫైజర్ ప్రకటన చేసింది. ఈ వ్యాక్సిన్ ను అమెరికాతో పాటు బెల్జియంలలో వినియోగానికి ఈ ఏడాది చివరికల్లా ఐదు కోట్ల డోసేజీలను ఉత్పత్తి చేస్తామని చెప్పింది.సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్లను అందించేందుకు చూస్తున్నట్లు ఫైజర్ ఇంక్ చైర్మన్ ఆల్బర్ట్ బోర్ల తెలిపారు. వ్యాక్సిన్ భద్రత, ప్రభావాలపై తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి కోసం అమెరికాలోనే కాకుండా యూరోపియన్, యూకే ఔషధ నియంత్రణ సంస్థలకు కూడా తాము దరఖాస్తు చేయనున్నట్లు వివరించారు. అంతేగాక, ఇతర దేశాలలోనూ దరఖాస్తు చేసుకోనున్నట్లు చెప్పారు. ఫైజర్ తయారీ వ్యాక్సిన్ ను అతి శీలత వాతావరణంలో నిల్వ చేస్తూ ప్రజలకు అందించాల్సి ఉండడంతో అవసరమైన కూలింగ్ సిస్టమ్స్ ను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి 5 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను సిద్ధం చేస్తామని ఫైజ‌ర్‌ తెలిపింది. ఒక్కొక్కరికి రెండుసార్లు ఇచ్చే ఈ ఇంజెక్టబుల్ వ్యాక్సిన్‌తో 2.5 కోట్ల మందిని కొవిడ్ నుంచి రక్షించవచ్చని పేర్కొంది. భార‌త్‌, చైనా, ర‌ష్యా దేశాల్లో కొన‌సాగుతున్న ప‌రిశోధ‌న‌లు తుదిద‌శ‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: