వినాయక చవితి వచ్చేస్తోంది. మరి వినాయక పూజకు ఏ విగ్రహం మంచింది..? ఇప్పుడు అంతా మట్టివిగ్రహాలను ప్రోత్సహిస్తున్నారు. వాటిని పూజించవచ్చా.. ఇలాంటి సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. నవరాత్రుల్లో మట్టి విగ్రహాలను పూజించడం చాలా మంచిది. పర్యావరణానికీ మేలు చేసిన వాళ్లం అవుతాము.


అయితే.. నిత్యపూజకు మాత్రం మట్టివిగ్రహాలు పనికిరావు. అందంగా వున్నాయి కదా అని మార్కెట్‌ లో దొరికే చెక్క విగ్రహాలు, మట్టి విగ్రహాలు నిత్య పూజకి వినియోగించ కూడదు. మట్టి విగ్రహాలకు పగుళ్ళు వస్తాయి. అలాంటి వాటిని నిత్యపూజకు వాడకూడదు. గణపతి నవరాత్రులలో, దసరాలలో కేవలం ఆ నవరాత్రులలో పూజించి తర్వాత ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేస్తారు కానీ, ఎక్కువకాలం పూజ చెయ్యరు కదా.


బంగారం, వెండి, ఇత్తడి, కంచు లోహాలతో తయారయిన విగ్రహాలను పూజలో పెట్టవచ్చు. అయితే ఈ విగ్రహాలు చిన్నవిగా వుండాలి. రాగితో తయారు చేసినది కేవలం గణపతి విగ్రహాన్ని మాత్రమే పూజించవచ్చు. స్ఫటిక విగ్రహాలు విశేష ఫలితాన్నిస్తాయి కానీ అవి పగలకుండా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఉగ్ర స్వరూపం వున్న విగ్రహాలను, చాలా తేజస్సుతో, భయంకరంగా వున్న విగ్రహాలను పూజించకూడదు.


పూజాసమయంలో మన దృష్టి దానిమీద వున్నప్పుడు మనకు ప్రశాంతత తగ్గే అవకాశం వున్నది. చిన్ముద్రతో, అభయ హస్తంతో ఆశీర్వదిస్తున్నట్లుండే విగ్రహాలను పూజిస్తే మనం నమస్కారం చేసి కళ్ళు తెరవగానే ఆ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు, మనవంక శాంతంగా, చిరునవ్వుతో చూస్తున్నట్లు వుంటే మనకి ఎనలేని ప్రశాంతత,ఎక్కడలేని ధైర్యం లభిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: