స్తంభేశ్వర మహాదేవ్ ఆలయం గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే! ఈ ఆలయాన్ని కావాలనే ఇలా నిర్మించారా లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం మాత్రం కష్టం.స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా, దీని చుట్టూ ఉన్న ఆలయాన్ని మాత్రం చాలా ఏళ్ల క్రితమే నిర్మించారు.సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపిస్తుంది.అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే బయటయపడుతూ భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది.



మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కళలను అనుసరించి ఒకో రోజు ఒకో తీరుగా ఈ ఆలయం దర్శన మిస్తుంది.శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించాడు.అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో సంహరించి నందుకు ఏదన్నా ప్రాయశ్చిత్తం చేయాలని అనుకున్నాడు. కార్తికేయుని వ్యధను గమనించిన విష్ణుమూర్తి ‘శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని’ సూచించాడు.అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలోని ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు అని నమ్ముతారు.



శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయన్ను అభిషేకిస్తున్నాడనుకోవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించు కునేందుకు వేలాదిమంది ఇక్కడకు వస్తారు. కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే... ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీ తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ 


మరింత సమాచారం తెలుసుకోండి: