"అన్నమయ్య" ఈ పేరు వినగానే "అదివో అల్లదివో శ్రీ హరి వాసము" అంటూ పాడే మన టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ భావం మరిపించేలా అభిమానుల మదిలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ వచేస్తున్నారు మన కమెడియన్ కం పొలిటీషయన్ పృథ్విరాజ్. 

చిన్నపిల్లలు సైతం ఇష్టపడే వ్యక్తి మన పృథ్విరాజ్. తాజాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ లో విడుదల చేసిన కొన్ని ప్రత్యేక ప్రోమోల్లో పృథ్వీ భక్త అన్నమయ్య అవతారం ఎత్తి కీర్తనలు ఆలపిస్తూ కనిపించాడు. దీంతో అటు సినీ పరిశ్రమ వర్గాలతో పాటు పలువురు ఆశ్చర్యనికి లోనయ్యారు.

 

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అధికారిక భక్తి ఛానెల్ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సినీనటుడు పృథ్వీరాజ్ తన మార్కు చూపించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఎస్వీబీసీ చానెల్ లో విడుదల చేసిన కొన్ని ప్రత్యేక ప్రోమోల్లో మన పృథ్వీ భక్త అన్నమాచార్యుని అవతారంలొ కీర్తనలు ఆలపిస్తూ కనిపించారు. గతంలో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గారు బాధ్యతలు నిర్వహించి వారికున్న ఒక ప్రత్యేక శైలిని చూపించారు. అయితే దర్శకేంద్రుని స్థానంలో బాధ్యతలు చేపట్టిన మన పృథ్వీ ఎలాగైనా ఎస్వీబీసీను ఇంకో మెట్టు ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. స్వతహాగా  పృథ్వీరాజ్ మంచి నటుడు కావడంతో తనదైన శైలిలో కొన్ని ప్రత్యేక ప్రోమోలను రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో తాను అలంకార ప్రాయంగా కూర్చోలేదని, బాద్యతాయుతంగానే పనిచేస్తున్నట్లు మెసేజ్ కూడా పృథ్వీ పంపించారు. 

ఏది ఏమైనప్పటికీ 30ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ మన పృథ్వి.., స్వామి వారి 7 కొండల మీద కూడా తన నటన కనపరచడం విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: