ప్రముఖ పుణ్యక్షేత్రమైన  తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానెల్  ఎస్వీబీసీకి చైర్మన్ గా ఉన్న నటుడు ఫృథ్వీ తాజాగా హాట్ కామెంట్ చేశారు. ఇటీవల ఫృథ్వీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ఎస్వీబీసీలో పాటలు పడడం.. వివిధ ప్రోగ్రాముల్లో పాల్గొనడానికి రూ.2లక్షలు ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు తెలియచేసారు.


తమ చానెల్ కు  కీరవాణి సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగా చాలా మంది అద్భుతమైన గాయకులు ఉన్నారని ఫృథ్వీ స్పష్టం చేశారు. స్థానిక కళాకారులతోనే మంచి మంచి  కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపారు ఫృథ్వీ. నేను నెలలో 20 రోజులు ఇక్కడే ఉండి స్వామి వారికీ  సేవ చేస్తానని స్పష్టం తెలియ చేశారు. మాజీ చైర్మన్  రాఘవేంద్రరావుకు గడ్డం ఉంటుంది..కానీ  నాకు ఉండదు అదే తేడా అని ఫృథ్వీ చెప్పుకొని వచ్చారు.


మాజీ ఎస్వీబీసీ  చానెల్  చైర్మన్ ఐనా దర్శకుడు రాఘవేంద్రరావు గురించి ప్రెసెంట్ ఎస్వీబీసీ చైర్మన్ ఫృథ్వీ  కామెంట్ చేశారు ఇలా. కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉందని.. ఎస్వీబీసీలోని ఉద్యోగులకు భద్రత సౌకర్యాలు సరికొత్త టెక్నాలజీతో చానెల్ రూపురేఖలు మారుస్తానని స్పష్టం తెలిపారు. సరి కొత్త అద్భుతమైన గాయకులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాను అనీ తెలిపారు.


నేను  ఒక్క రోజు షూటింగ్ కు వెళ్తే  30 లక్షలు సంపాదించేవాడనని.. కానీ ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎస్వీబీసీలో సేవ చేసుకుంటూ ఉంటాను అనీ ఫృథ్వీ అన్నారు. టీటీడీ వాహనాలు కూడా నేను వాడడం లేదని క్లారిటీ కూడా ఇచ్చారు. ఎస్వీబీసీలో గతంలో జరిగిన అక్రమాలపై సీఎం కార్యాలయానికి ఫైల్ కూడా పంపిస్తానని ఫృథ్వీ అన్నారు.మరి చూడాలి ఏ విధానంగా ఫృథ్వీ ఎస్వీబీసీ చానెల్ ని అభివృదిలో నిలుపుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: