దేశం లోనే ప్రముఖ పుణ్య క్షేత్రంగ ప్రసిద్ధి కెక్కిన  తిరుమల తిరుపతి గత 5 ఏళ్లలో  బాగా అభివృధ్ది చెందింది. రాష్ట్ర విభజనతో నగరానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. నిత్యం   వచ్చే భక్తులు ప్రముఖుల తాకిడితోపాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సమావేశాలకు కేంద్రమైంది

. బెంగళూరు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లే రహదారులు, యాత్రికులు సంచరించే మార్గాలు ఆధ్యాత్మిక చిత్రాలు, ఆహ్లాదభరిత మొక్కలతో ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచంలోనే తిరుపతికి గుర్తింపు లభిస్తున్నా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీతో యాత్రికులు అవస్ధలు పడుతున్నారుబస్సులు, విమానాలు, రైళ్లు, సొంత వాహనాలు ద్వారా వచ్చిన భక్తులు తిరుపతి మీదుగా తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది.

తిరుపతికి ప్రతి రోజు దాదాపు 40 వేల వాహనాలు వచ్చి వెళుతుంటాయి. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా సుమారు లక్ష మందిపైగా తిరుమలకు వస్తుంటారు. వీరంతా తిరుపతిలో ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీ పెరగడం, రోడ్లన్నీ ఆక్రమణలతో నిండిపోవడంతో నగరంలో ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుంది. యాత్రికులే కాక స్థానికంగా ఉన్న ప్రజలుకూడా రోడ్డుపైన సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. తిరుపతి నగర జనాభా 5 లక్షలకు చేరింది.


తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చటానికి రూపొందించిందే గరుడ వారధి ఫ్లై ఓవర్. పనులు ప్రారంభించిన నాటినుంచి 2 ఏళ్లలో ఫ్లై ఓవర్ పూర్తి చేసి,5 ఏళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలనే నిబంధనతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం  ఆబ్కామ్ సంస్ధకు కాంట్రాక్టు కట్టబెట్టింది. భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది.  బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: