శ్రీ హనుమత్ శాస్త్రీ వేద
పాఠశాల ,మంచిర్యాల విద్యార్ధుల వేద పఠనంతో
కోటి దీపోత్సవం ప్రారంభం అయ్యింది. జివి.ప్రభాకర్ బృందంచే భక్తి గీతాలు ఆలాపన చేశారు..రమణమూర్తి బృందంచే సర్వవాద్య సమ్మేళనం. శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి ప్రవచనం. కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం పలికారు. వేదికపై శ్రీ శ్వేతార్కమూల గణపతికి కోటిగరికార్చన..చౌకిలపై గణపతి విగ్రహాలకు
కోటి గరికార్చన కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక స్వామి కల్యాణోత్సవం
మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు .
కోటి దీపోత్సవం కార్యక్రమానికి కమలేశ్ డి.పటేల్జీ, రామచంద్రమిషన్
అంతర్జాతీయ అధ్యక్షులు , శ్రీ వ్రతథరరామానుజ జీయర్ స్వామి ,జగన్నాథ మఠం పీఠాధిపతి, శ్రీ
శివ స్వామి ,శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతి పాల్గొనగా..ముఖ్య అతిధులు గా జి.కిషన్ రెడ్డి , MoS for
home Affairs, వైవి .సుబ్బారెడ్డి ,టిటిడి చైర్మన్ ,
అంజనీకుమార్ ,హైదరబాద్ సిటి పోలీసు కమీషనర్, సోహన్ లాల్ సోలంకి , భజరంగదళ్ అధ్యక్షులు..మరియు వేలాదిగా భక్తకోటి జనం పాల్గొన్నారు.