ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు గురువారం,12.12.2019 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 16C°-23℃°

 

• నిన్న 57,607 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 15 గదిలో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 08 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.53 కోట్లు.

 

• నిన్న 26,581 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న 15,202 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు

 

• 17న ధ‌నుర్మాసం ప్రారంభం.

• 25న శ్రీతొండ‌ర డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్షత్రం.

• 26న అధ్య‌య‌నోత్స‌వం, సూర్య‌గ్ర‌హ‌ణం.

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు.

 

చంటి పిల్లల తల్లిదండ్రులు/ ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: