మనం ఎప్పుడైనా తిరుపతికి వెళ్లి వచ్చాము అని.. ఎవరితో అయినా చెప్తే.. అక్కడ లడ్డు తెచ్చావా ? లడ్డు ఎంత అద్భుతమో.. ఎంత రుచిగా ఉంటుందో అని తిరుమల దేవుడిని దర్శించున్న వారి నోటి నుండి.. ఆ లడ్డు తిన్నవారి నోటి ఖచ్చితంగా వచ్చే మాటలు ఇవి. అయితే ఇప్పుడు తాజాగా ఈ తిరుమల అమృత లడ్డు గురించి తాజా అప్డేట్ ఇది.. 

 

తిరుమలలో రాయితీ లడ్డూ విధానానికి నేటితో స్వస్తి చెప్పనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. లడ్డూ ప్రసాదం పంపిణీలో ఈ రోజు అర్థరాత్రి నుంచి కొత్త విధానం ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక్క లడ్డూ మాత్రమే అందిస్తామని అయన తెలిపారు.

 

అంతేకదా ఒకటికి మించి ప్రతీ అదనపు లడ్డూ కోసం రూ.50 చొప్పున చెల్లించాలని అయన పేర్కొన్నారు. రోజుకు 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం అని అయన తెలిపారు. భక్తులకు కావాల్సినన్ని లడ్డూలు అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: