దసరా పండుగ విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. భారతదేశమంతటా.. ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకుంటూంటారు. ఈ దసరానే విజయదశమి అని కూడా అంటారు. రావణుడిపై రాముడి విజయం సాధించినందుకు.. దక్షిణాది రాష్ట్రాల్లో దసరాని జరుపుకుంటూంటారు. అలాగే.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో.. రాక్షసుల రాజు.. మహిషాసురిడిని అంతమొందించి.. దుర్గమ్మ.. విజయం సాధించినందుకు విజయదశమిని చేసుకుంటూంటారు. అయితే.. ఈ పండుగ రోజున.. పాలపిట్టను చూస్తే మంచిదని.. నానుడి. విజయదశమి రోజున ఈ పిట్టను చూడగలగటాన్ని ఎంతో అదృష్టంగా, శుభ సూచికంగా ప్రజలు భావిస్తారు.


దసరా పండుగ వచ్చిందంటే.. జమ్మి చెట్టు ఎలా గుర్తుకువస్తుందో.. పాలపిట్ట కూడా.. అలాగే గుర్తుకు వస్తుంది. గుప్పెడంత ఉండే ఈ పాలపిట్టను.. విజయదశమి రోజున మొక్కాల్సిందే. దీన్ని ఆరోజు చూడటం వల్ల అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతీ పని విజయవంతం అవుతుందని.. భక్తుల విశ్వాసం. కాగా.. ఇంతకీ ఈ పాలపిట్టను దసరా రోజే ఎందుకు చూడాలి..? అనే ప్రశ్న వచ్చింది కదా..! దీనికి కూడా ఓ చరిత్ర ఉంది. పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని.. రాజ్యానికి తిరిగి వస్తుండగా.. ఈ పాలపిట్ట కనబడిందట. అప్పటి నుంచీ వారికి విజయాలు సిద్ధించాయని.. ఓ జానపద కథ. అందుకే విజయదశమి రోజున పాలపిట్టను చూడాలి.. అంటూంటారు పెద్దలు. అంతాబాగానే.. ఉన్నా.. ప్రస్తుతం ఈ పక్షి జాడ అసలు కనిపించడమే లేదు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో.. ఈ పక్షులు కనుమరుగయిపోయాయి.


పల్లెల్లో ఇవి అప్పుడప్పుడు మెరుపు మెరిసినట్లుగా కనిపిస్తున్నా..సిటీల్లో మాత్రం కనిపించకుండాపోయాయి. అందుకే దసరా  పండుగనాడు కొందరు ఈ పాలపిట్టలను పట్టుకుని పంజరంలో ఉంచి చూపిస్తూ డబ్బులు వసూలు  చేస్తుంటారు. మరి కొందరు దసరా నాడు పాలపిట్టలను కొని ఊరి చివర పొలాల మధ‌్య విడిచి  పెడుతుంటారు. ఏదేమైనా దసరా పండుగ వచ్చిందంటే  ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కే పక్షిఈ పాలపిట్ట. తెలంగాణలో పాలపిట్టకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పాలపిట్టనురాష్ట్ర పక్షిగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: