మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం కాబట్టి. పురాతన సంప్రదాయాలు మరియు ఆచారాలను నమ్ముతాము. ఇందులో వాస్తుశాస్త్రం కూడా ఒక భాగమే అని తెలిసిందే. చాల మంది ఇంట్లో ఏ కార్యం తలపెట్టినా వాస్తు ప్రకారం జరగాలని పట్టుబట్టి మరీ జరిపిస్తూ ఉంటారు. ఒక గృహాన్ని నిర్మించే దగ్గర నుండి ఆ గృహంలో ఎలాంటి  వస్తువులు పెట్టాలి ? ఎక్కడ పెట్టాలి ? ఇలా అన్ని విషయాలను వాస్తు ప్రకారం చేయాలని చూస్తాము. ఈ విధంగా వాస్తును పాటించి చేయడం వలన వారికి ధనప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అంతే కాకుండా ఆ ఇంటి వారికి ఆరోగ్యం మరియు ఆదాయం విషయంలో మంచి జరుగుతుందని నమ్ముతారు.

ఇలా వస్తూ విషయంలో జాగ్రత్తగా ఉండే మనము కొన్ని విషయాలను మాత్రం పట్టించుకోకుండా చేస్తూ ఉంటామని తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా చూస్తే సాయంత్రం సమయంలో కొన్ని పనులను చేయడంలో జాగ్రత్తలు పాటించాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. ఇంతకీ ఆ పనులేమిటో ఒకసారి చూద్దామా...? వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదట. ఇలా చేస్తే చాలా ప్రమాదకరమని పండితులు చెబుతున్నారు. కేవలం ఇంట్లోనే కాదు.. ఆఫీసులో కూడా సాయంకాలం వేళ మహిళల్ని వేధించడం మరియు నిందించడం వంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. లక్ష్మీదేవికి ఒక్కసారి ఆగ్రహం తెప్పించారంటే తరువాత మీరు ఎన్ని పూజలు చేసినా ఆమె శాంతించదు. తద్వారా మీకు ధనప్రాప్తి దూరమవుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా సాయంత్రం సమయంలో నిద్రించడం మహా పాపంగా వాస్తు శాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే ఓసారి ముఖం కడుక్కుని ఏదైనా పని చేసేందుకు ప్రయత్నించండి. అయినా కూడా మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు ఎవరితోనైనా మాట్లాడటం మొదలుపెడితే మంచి ఫలితం ఉంటుంది. సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదట మరియు ఈ సమయంలో తులసి మొక్కకు నీరు పోయడం చేయవద్దు.. పై విషయాలన్నీ గుర్తించుకుని జాగ్రత్త పడితే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: