ఈ ప్రపంచంలోని దేశాల నుండి కోట్ల మంది భక్తులు ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తిరుపతిలో వెలసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈయనను భక్తులందరూ వారి ఆరాధ్య దైవంగా కొలుస్తూ ఉంటారు. స్వామి వారి సన్నిధిలో రకరకాలైన ప్రసాదాలు ఉండగా, చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు మరియు డ్రై ఫ్రూట్స్‌ లతో తయారు చేసే లడ్డూ అంటే చాలా ప్రత్యేకం. ఈ లడ్డు కోసం భక్తులు గంటల తరబడి లైన్ లో వేచి మరీ తీసుకుంటూ ఉంటారు. ఈ లడ్డూలను అమ్మడం ద్వారా ప్రతి సంవత్సరం కోట్లలో ఆదాయం వస్తుందని తెలుస్తోంది. టీటీడీ వారికి ఒక్క రోజులోనే దాదాపు మూడు లక్షలకు పైచిలుకు లడ్డూలను తయారుచేయగల సామర్థ్యం ఉంది. ఒకవేళ దర్శనానికి వెళ్లిన భక్తులకు లడ్డూ తీసుకోకపోతే తీవ్ర అసంతృప్తితో ఉండేవారు.

కాబట్టి ఎలాగైనా లడ్డును పొందనిదే తిరుమల విడిచి వెళ్లేవారు కాదు. ఇటువంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న లడ్డుకి ఉన్న చరిత్ర గురించి ఎప్పుడైనా తెలుసుకోవాలని మీకు అనిపించిందా ? మరి లడ్డూ వెనుకున్న ఆ చరిత్ర ఎంతో ఒకసారి చూద్దాం. ఈ లడ్డూ నిన్నటితో 306 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలుస్తోంది. కానీ ఈ విషయంలో చాలా మందికి కొన్ని సందేహాలున్నట్లు తెలుస్తోంది. మనకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఈ లడ్డూను 1715 ఆగష్టు 2 వతేదీ నుండి ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ లడ్డూ తయారీ కోసం వందల మంది భక్తులు పనిచేస్తారు. అయితే ఈ సమాచారంలో ఎంత మాత్రం నిజముందో మాత్రం ఎవ్వరికీ తెలియదు.

కానీ ప్రాచీన వివరాలను బట్టి చూస్తే, ఇంతకు ముందు అంటే క్రీ.శ. 1803 వ సంవత్సరంలో శ్రీవారి ప్రసాదంగా బూందీని ఇచ్చే వారట. ఆ తరువాత ఆ బూందీని 1940 సంవత్సరానికి లడ్డూగా మారినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి శ్రీ వారి ప్రసాదమైన లడ్డూకి 306 సంవత్సరాలా ? లేదా 81 సంవత్సరాలా ? అన్నది ఇంకా స్పష్టత లేదు. ప్రారంభంలో లడ్డూ కేవలం ఎనిమిది అనలే ఉండేదట... కాలక్రమేణా అది 25 రూపాయల వరకు వెళ్ళింది. ఇలా ఇప్పటికీ లడ్డూ కి ఎన్ని సంవత్సరాలన్నది తెలియలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: