లక్ష్మీదేవీ కటాక్షం అందరికీ దొరకదు. చాలా మంది ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతుంటారు. బిజినెస్‌లో లాస్ రావడంతో ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవీ కటాక్షం కలుగపోతే.. పేదరికం నుంచి బయటకు రాలేము. అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవీ రావాలన్నా.. పాజిటివ్ ఎనర్జీ ఉండాలన్న కొన్ని రకాల చిట్కాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ చిట్కాలతో లక్ష్మీదేవీ కటాక్షం పొందవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడాలంటే రాత్రివేళల్లో ఈ పద్ధతులు పాటిస్తే చాలా మంచిదని, దీని ఫలితం మీకే తెలుస్తుందని పండితులు సలహా ఇస్తున్నారు.

ఈ పద్ధతులు ఇంట్లో పాటిస్తే.. ఇంట్లో లక్ష్మీదేవీ వస్తుందని, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తొలగడంతోపాటు కుటుంబాల మధ్య సంబంధాలు కూడా మెరుగు పడతాయని చెబుతున్నారు. అయితే ఎలాంటి పద్ధతులు పాటిస్తే ఇంట్లో లక్ష్మీదేవీ ఉంటుందనే విషయాలను తెలుసుకుందాము. ఇంట్లో ఆడవాళ్లు నిద్రపోయే ముందు ఆవనూనెను తీసుకుని దక్షిణ దిక్కున రాయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు కలుగుతాయని, ఇంట్లోని కుటుంబసభ్యులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

అలాగే రాత్రి పడుకునేటప్పుడు దీపం లేదా చిన్న బల్బును ఇంట్లో వెలిగేలా చూసుకోవాలి. అలాగే ఇళ్లు మొత్తం చిందరవందరగా ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రివేళ్లల్లో ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే.. ఇంట్లోకి లక్ష్మీదేవీ వస్తుందని పండితులు చెబుతున్నారు. రాత్రి వండుకుని తిన్న పాత్రలను కూడా క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. అలా చేస్తే మంచిదని చెబుతున్నారు. కానీ చాలా మంది రాత్రి తినేసిన సామాన్లను అలానే వదిలేస్తారు. ఇలా చేస్తే ధనలక్ష్మీ ఇంట్లోకి రాదని చెబుతున్నారు. నెగిటివ్ ప్రభావం పడుతుందని, దీనివల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తాయన్నారు. కాబట్టి రాత్రిపూట కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను గౌరవించాలి. తల్లిదండ్రులను, అత్తా మామలను గౌరవిస్తే లక్ష్మీదేవీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: