అయితే గంభీర్ వ్యాఖ్యలు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని అతను ఈవ్యాఖ్యలు చేశాడని అర్ధం అవుతుంది. ఎందుకంటె టెస్టుల్లో ధోని, రోహిత్ లేకుండా గత కొంత కాలంగా కోహ్లీ సారథ్యంలో స్వదేశం లోనే కాకుండా విదేశాల్లో కూడా అద్భుతమైన విజయాలను సాధిస్తూ వస్తుంది టీం ఇండియా. అంతెందుకు ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను గెలిచి అత్యధిక టెస్ట్ మ్యాచ్ లను గెలిపించిన భారత సారథిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. మరి అలాంటప్పుడు కేవలం ధోని , రోహిత్ కారణంగానే కోహ్లీ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్నాడనడం లో అర్ధం లేదు. గంభీర్ అన్నట్టు ఐపీఎల్ లో కోహ్లీ తన జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలుపలేకపోయాడు అయితే దానికి కోహ్లీ కెప్టెన్సీ ఒక్కటే కారణం కాదు ఈ విషయాలను గంభీర్ మరిచిపోయినట్లున్నాడు.