దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కు ఊహించిన  ఎదురుదెబ్బ తగిలింది.  టీం ఇండియా స్టార్ పేస్ బౌలర్  జస్ప్రీత్ బుమ్రా  వెన్నులో  గాయం కారణంగా   మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు.  అతని  స్థానంలో  సీనియర్ సెలక్షన్ కమిటీ  ఉమేష్ యాదవ్ ను  ఎంపిక చేసింది. ఉమేష్ తో కలిసి  ఇషాంత్ , షమీ పేస్ బాధత్యలను  మోయనున్నారు.  ఇప్పటికే సౌత్ ఆఫ్రికా తో టీ 20 సిరీస్ ను డ్రా చేసుకొని నిరాశలో  వున్నా  టీం ఇండియా కు తాజాగా  బుమ్రా  గాయం షాక్ ఇచ్చింది. 

ఇటీవల  వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో  రెండు సార్లు 5వికెట్లు తీసి  అదరగొట్టాడు బుమ్రా.  మొత్తం ఈసిరీస్ లో 13వికెట్ల తో అతను  టోర్నీ టాపర్ గా నిల్చాడు.  అయితే  అద్భుతమైన  ఫామ్ లో వున్న  సమయంలో  బుమ్రా  .. జట్టుకు దూరమవ్వడం టీం ఇండియా  అభిమానులను కలవరపెడుతుంది.   ఇప్పటివరకు 12టెస్టులు ఆడిన  బుమ్రా 62 వికెట్లు పడగొట్టడం విశేషం. 


ఇక  సౌత్ ఆఫ్రికా తో జరుగనున్న  మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ అక్టోబర్ 2నుండి ప్రారంభం కానుంది. సొంత గడ్డ ఫై చెలరేగి  సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనీ భారత్ భావిస్తుంది. ఈ సిరీస్   ద్వారా తొలి సారి అంతర్జాతీయ  టెస్ట్ క్రికెట్ కు ఎంపికయ్యాడు  టీం ఇండియా  యువ ఓపెనర్  శుభమాన్ గిల్. మరి  ఈసిరీస్ లో ఒక్క మ్యాచ్ లోనైనా  గిల్ తుది జట్టులో స్థానం సంపాదించుకుంటాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: