సీజన్ లీగ్ దశ మ్యాచ్లు ఈనెల 11 వరకూ జరగాలిసి ఉంటే.. ఇప్పటిదాకా ఐదు జట్లు ప్లేఆఫ్ బెర్తుల్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో దబాంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, బెంగళూరు బుల్స్ టాప్-5లో ఉండగా.. మిగిలిన ఒక బెర్తు కోసం యూపీ యోధా, జైపూర్ పింక్ పాంథర్స్ పోటీ బరిలో ఉన్నాయి.
ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో తెలుగు టైటాన్స్ తొలిసారి ఆల్రౌండర్ ప్రదర్శన చాల బాగా కనబర్చింది.
పుణెరి పల్టాన్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో 50పైచిలుకు పాయింట్లు సాధించిన తెలుగు టైటాన్స్.. చివరిలో మాత్రం చిన్న తప్పిదాల కారణంగా 50-53 తేడాతో ఓటమి పాలుఅయేంది. టోర్నీ లీగ్ దశలో ఇప్పటికే 19 మ్యాచ్లాడిన తెలుగు టైటాన్స్కి ఇది 11వ ఓటమికాగా.. 21వ మ్యాచ్ ఆడిన పుణెరి పల్టాన్కి ఇది 11వ గెలుపు.
మ్యాచ్లో తెలుగు టైటాన్స్ స్టార్ రైడర్ సిద్ధార్థ దేశాయ్ విఫలమవగా.. యువ రైడర్ రాకేశ్ గౌడ్ 16 పాయింట్లతో తన డైన రీతిలో తన సత్తాచాటాడు.
17 సార్లు రైడ్కి వెళ్లిన రాకేశ్.. జట్టుని గెలిపించేందుకు చాల ప్రయత్నించాడు. కానీ.. డిఫెన్స్ తప్పిదాలు జట్టుకి గెలుపుని దూరం చేశాయి. డిఫెండర్ ఆకాశ్ ఐదు పాయింట్లతో ఫర్వాలేదనిపించాడు.కానీ చివరికి గెలుపుని కైవసం చేసుకోలేక పోయంది.
పుణెరి పల్టాన్ జట్టులో స్టార్ రైడర్ మన్జీత్ 15 సార్లు రైడ్కి వెళ్లి 11 పాయింట్లు సాధించగా.. డిఫెండర్ సుర్జీత్ 11 సార్లు ట్యాకిల్స్కి ప్రయత్నించి 7 పాయింట్లని టీమ్కి అందించగలిగాడు. మ్యాచ్ ఆరంభంలోనే తెలుగు టైటాన్స్ని ఆలౌట్ చేసిన పుణెరి.. మధ్యలో బాగా తడబడింది. దీంతో.. బాగా తలబడుతున్న తెలుగు టైటాన్స్ గెలిచేలా కనిపించింది. కానీ.. ఒత్తిడిని జయించిన పుణెరి మూడు పాయింట్ల తేడాతో గెలుపుని కైవసం చేసుకుంది.