ఇక ఇంతకుముందు కూడా ఇదే విషయంలో పలు సార్లు రవిశాస్త్రి ట్రోల్స్ కు గురైయ్యాడు. కాగా ఇటీవలే వరుసగా రెండో సారి భారత టీం కు ప్రధాన కోచ్ గా ఎంపికైయ్యాడు రవిశాస్త్రి. ఇంతకుముందు ఏడాదికి 7కోట్ల వేతనం తీసుకున్నఅతను ఇప్పుడు 10కోట్లు తీసుకుంటున్నాడు. ఇదిలావుంటే ప్రస్తుతం జరుగుతున్న రాంచి టెస్ట్ తో మూడు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మూడో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే అల్ ఔట్ అయ్యి ఫాలో ఆన్ కూడా తప్పించుకోలేకపోయిన ప్రొటీస్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే ప్రదర్శన ను కొనసాగిస్తుంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా 8వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తేడాతో ఓటమి చెందకుండా ఉండాలంటే ఆ జట్టు మరో 203 పరుగులు చేయాలి.. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో అది దాదాపు అసాధ్యం కాబట్టి వరుసగా రెండో సారి ఇన్నింగ్స్ ఓటమి తో సౌతాఫ్రికా భారత పర్యటనను ముగించనుంది .