బాలీవుడ్ నటి, పటౌడీ వంశం కోడలు కరీనా కపూర్ ఖాన్‌కు అరుదైన గౌరవం లభించింది.    మెల్‌బోర్న్‌ క్రికెట్​ మైదానం​లో జరిగిన కార్యక్రమానికి కరీనా హాజరైంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న పురుషుల, మహిళల ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీలను శుక్రవారం ఆమె మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇది తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీలో భాగస్వామ్యం కావడం సంతోషం గా ఉందన్నారు.


 ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.  టోఫీల ఆవిష్కరణ తర్వాత కరీనా కపూర్ ఖాన్ స్టేడియంలో ఫోటోలకు ఫోజులిచ్చారు.  ఈ సందర్భంగా స్టేడియంలోని గ్యాలరీలో కూర్చుని, స్టేడియంలో లోపల సచిన్ ఫోటో పక్కనే ఫోజులిచ్చారు. "టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీలను ఆవిష్కరించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానంటూ పోస్ట్ చేసింది.   ఆయా దేశాల జట్ల తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లు తమ కలను నెరవేర్చుకుంటున్నందుకు అభినందనలు తెలియజేస్తూ ....  ఇలాగె వారిని ప్రోత్సహించాలనుకుంటున్నానని చెప్పారు.


అంతర్జాతీయ వేదికపై వారు మరింత రాణించాలి".నటి కరీనా కపూర్​... భారత మాజీ సారథి దివంగత మన్సూర్​ అలీఖాన్ పటౌడీకి కోడలు కావడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళల ప్రపంచకప్​, అక్టోబర్​ 18 నుంచి నవంబర్​ 15 వరకు పురుషుల ప్రపంచకప్ మ్యాచ్​ల​ను నిర్వహించనుంది ఐసీసీ. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-1లో ఉన్నాయి.

భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-2లో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది. కరీనా, అక్షయ్​ కుమార్​ కాంబినేషన్​లో 'గుడ్​ న్యూస్​' అనే చిత్రం తెరకెక్కుతోంది. కియరా అడ్వాణీ, దిల్జీత్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: