భారత్ మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తో తనని పోల్చడం కరెక్ట్ కాదని టీమిండియా బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ అన్నాడు . దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్టు సిరీస్ లో ఓపెనర్ అవతారమెత్తిన రోహిత్ శర్మ, ఒక సెంచరీ , డబుల్ సెంచరీ సాధించిన విషయం తెల్సిందే . టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో  రోహిత్ సున్నా పరుగులకే వెనుతిరిగారు . దీనితో తీవ్ర ఒత్తిడి మధ్య తొలిటెస్టు లో  ఓపెనర్ గా బ్యాటింగ్ ప్రారంభించిన రోహిత్ , అద్భుత బ్యాటింగ్ తో  సెంచరీ సాధించాడు .


 ఇక అదే ఊపును కొనసాగిస్తూ చివరి టెస్టు లో డబుల్ సెంచరీ సాధించడం తో, ఇప్పుడు రోహిత్ ను అందరూ మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తో పోలుస్తున్నారు . సెహ్వాగ్ తో పోల్చడం పట్ల ఒకింత ఆనందాన్ని వ్యక్తం చేస్తూనే రోహిత్ ఆయన తో పోల్చడం కరెక్ట్ కాదని అంటున్నాడు .  సెహ్వాగ్ తో కలిపి తన పేరు వినపడడం సంతోషంగా ఉందంటూనే , తామిద్దరం ఒకే మాదిరిగా ఆడుతామని జనం అనుకుంటున్నారని చెప్పాడు . కానీ సెహ్వాగ్ ..సెహ్వాగ్ అని అన్నాడు రోహిత్ .


అతడు సాధించినది నిరూపమని అన్నాడు . నావరకు జట్టు ఏదైతే కోరుకుంటుందో తన పని , జట్టు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తే రెట్టింపు ఆనందపడుతానని చెప్పాడు రోహిత్ . టెస్టు ఓపెనర్ గా సత్తాచాటడం పట్ల హిట్ మెన్ ఒకవైపు ఆనందం  వ్యక్తం చేస్తూనే , ముందుగానే ఓపెనర్ గా వచ్చి ఉంటే బాగుండేది కదా అన్న మాటకు ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుందని అన్నాడు రోహిత్ .


మరింత సమాచారం తెలుసుకోండి: