టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికి తెలిసిన విషయమే ధోని ని అభిమానించని వారు అంటూ ఎవరు వుండరు .ధోని ఆటకు, మాటలకూ ఫీదా అవ్వని అభిమానంటూ ఎవ్వరు వుండరు, ప్రపంచ క్రికెట్లోధోనికంటూ ఒక ప్రత్యకమైన అభిమాన గణం ఉన్నట్టు అందరికి తెలిసిన విషయమే . ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోని ఫ్యామిలీతో సరదాగా సమయం గడుపుతున్నాడు.
వన్డే వరల్డ్కప్ ముగిసిన తర్వాత తన వ్యక్తిగత వ్యవహారాలను చూసుకుంటూ కుటుంబంతోనే ఉంటున్నాడు. అయినప్పటికీ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు అలానే కొనసాగుతుంది. అభిమానులంతా మల్లి ధోని క్రికెట్లో ఎప్పుడు అడుగు పెడతాడా అని ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఒక అభిమానికి ధోనిని ఆకస్మికంగా కలిసే అవకాశం దొరికింది.
దాన్ని అతడు వదులుకోలేదు ,ఛాన్స్ దొరకడమే గొప్పగ భావించి ధోనితో మాట్లాడమే కాకుండా ఆటోగ్రాఫ్ను కూడా తీసుకున్నాడు. అయితే ఆటోగ్రాఫ్ అడిగిన సదరు అభిమానికి వింత అనుభవం ఎదురైంది.జీవితాంతం మరిచిపోలేని
గిఫ్ట్ కూడా పొందాడు . ఆటగాళ్లను ఎవరైనా ఆటోగ్రాఫ్ అడిగితే ఏం చేస్తారు.. టీ షర్టులపై కానీ జెర్సీలపై సంతకాలు చేసి ఇస్తారు. మరి ధోని ఆశ్చర్యపరుస్తూ సదరు అభిమాని ఎన్ఫీల్డ్పైనే సంతకం చేశాడు. దాంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తనకు ఎప్పటికీ గుర్తిండి పోయే
గిఫ్ట్ లాగా ధోని ఆటోగ్రాఫ్ ఇవ్వడంతో అభిమాని ఖుషీ అయిపోయాడు.
ఇటీవల ధోని నిస్సాన్ జోంగా కారును కొన్న సంగతి తెలిసిందే. కాగా, ధోనికి బైక్లు అంటే విపరీతమైన ఇష్టం. సుమారు 74 బైక్లు వరకూ ధోని వద్ద ఉండటం, ధోనికి మోటర్ బైక్ల పైన ఉన్న
ప్రేమ ఈ సంఘటనాతో అభిమానులకు మరింతగా తెలిసేల చేసారు .