బాహుబలి 2 తరువాత  రెండేంళ్ళు  గ్యాప్ తీసుకొని  ఇటీవల  సాహో తో ప్రేక్షకులముందుకు వచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్. భారీ అంచనాల  మధ్య విడుదలైన  ఈచిత్రం హిందీ లో తప్ప మిగితా అన్నిభాషల్లో  డిజాస్టర్ అయ్యింది. అయితే విపరితమైన నెగిటివ్ టాక్ తో కూడా ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా అన్ని  భాషల్లో కలిపి 400కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషం. ఇక ఈ చిత్రం సెట్స్ మీద  ఉండగానే  ప్రభాస్ , జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్  డైరెక్షన్ లో  ఓ సినిమాను మొదలుపెట్డాడు. ఈచిత్రానికి  జాన్ అనే టైటిల్ ప్రచారం లోవుంది.  ఇటీవల  ఈచిత్రం రెండు షెడ్యూల్స్ ను కూడా  కంప్లీట్ చేసుకుంది.  ఆతరువాత  ప్రభాస్ సాహో తో  బిజీ కావడంతో  ఈసినిమా షూటింగ్  కు బ్రేక్ ఇచ్చారు. 



ఇక  ప్రభాస్ మళ్ళీ జాన్ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.  ఈ సినిమా  కొత్త షెడ్యూల్  ఈనెల 18నుండి జరుగనుందని సమాచారం.  ఈషెడ్యూల్ కోసం  అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ లను నిర్మిస్తున్నారు.  పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ  చిత్రంలో  పూజా హెగ్డే  మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా   రెండో హీరోయిన్  గా సాష ఛెత్రి కనిపించనుంది.  ఎయిర్ టెల్ యాడ్ ద్వారా నార్త్ తో పాటు సౌత్ లోనూ ఫేమస్ అయిన సాషాకు  తెలుగులో ఇది రెండో సినిమా. ఇంతకుముందు  ఆమె , ఆది హీరోగా నటించిన  ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో  కీలక పాత్రలో  నటించింది. అయితే  ఇటీవల విడుదలైన ఈ చిత్రం  ఘోర పరాజయాన్ని చవిచూసింది.  మరి జాన్ రూపంలో నైనా సాషాకు బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.  భారీ బడ్జెట్ తో  గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా   నిర్మిస్తుండగా  సైరా ఫేమ్  అమిత్ త్రివేది  సంగీతం అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం  తెలుగు తోపాటు ,తమిళ,హిందీ , భాషల్లో  విడుదలకానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: