ఇక ప్రభాస్ మళ్ళీ జాన్ షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈనెల 18నుండి జరుగనుందని సమాచారం. ఈషెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ లను నిర్మిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రెండో హీరోయిన్ గా సాష ఛెత్రి కనిపించనుంది. ఎయిర్ టెల్ యాడ్ ద్వారా నార్త్ తో పాటు సౌత్ లోనూ ఫేమస్ అయిన సాషాకు తెలుగులో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె , ఆది హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో కీలక పాత్రలో నటించింది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరి జాన్ రూపంలో నైనా సాషాకు బ్రేక్ వస్తుందో లేదో చూడాలి. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సైరా ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం తెలుగు తోపాటు ,తమిళ,హిందీ , భాషల్లో విడుదలకానుంది.