దుర్గ ఫుట్‌బాల్‌ క్రీడాంశంలో దుమ్మురేపుతోంది ఈమే  కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలకు చెందిన క్రీడాకారిణి .  కామసాని దుర్గ ఇప్పటికే పలు రాష్ట్రలలోను , జాతీయస్థాయి పోటీలలోను తన సత్తాను దీటుగా చాటారు .. ప్రపంచ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ను   2020లో  నిర్వహించనున్నారు ,ఇందులో పాల్గొనేందుకు  ఇండియాజట్టు ఎంపికల కోసం నిర్వహించే వరల్డ్‌కప్‌ ప్రిపరేషన్‌ నేషనల్‌ క్యాంపునకు దుర్గ ఎంపికైంది.

క్యాంపులో ఈమె చక్కటి ప్రతిభ కనబరిస్తే 16 దేశాల క్రీడాకారిణులు పాల్గొనే ఈ ప్రపంచ మహిళల ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో రాష్ట్రం నుంచి ఈమె ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.
 కామసాని దుర్గ కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థి ,ఈమే ఫుట్‌బాల్‌ క్రీడలో చక్కగా ముందుగు కొనసాగుతుంది . చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కె.ఎన్‌.పెంట గ్రామానికి చెందిన రమేష్‌రెడ్డి, రోశమ్మల కుమార్తె అయితే ఈమె తొలుత హకీంపేటలోని క్రీడాపాఠశాలలో ప్రవేశం పొందింది.

రాష్ట్ర విభజన అనంతరం స్థానికత ఆధారంగా 2014లో ఈమెను కడప వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి  ఎం. హరి  ఫుట్‌బాల్‌ శిక్షకుడు,ఆయన దగ్గర  ఫుట్‌బాల్‌లో మెలకువలు నేర్చుకోవడంతో పాటు పలు టోర్నమెంట్‌లలో విజయం సాధిస్తూ  వచ్చింది. ఎస్‌జీఎఫ్, అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి, సౌత్‌జోన్, జాతీయస్థాయి పోటీల్లో నిలకడగా రాణిస్తూ వస్తోంది. కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఈమె సత్తాచాటారు.

అదే విధంగా 2015–16లో భోపాల్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఈమె రాణించారు. 2016–17లో చెన్నైలో నిర్వహించిన ఖేలోఇండియాలోను, సబ్‌జూనియర్‌ విభాగంలో సత్తాచాటారు. 2017–18లో బెంగుళూరు, పూణేలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్, ఊర్జా మీట్‌లలో సత్తాచటారు. 2018–19లో కటక్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్స్‌లోను, త్రిపురలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ నేషనల్‌ పోటీల్లో ఈమె చక్కటి ఆటతో విజయాన్ని సాధించింది  . 2019–20 సంవత్సరానికి గాను ఢిల్లీలో నిర్వహించిన జాతీయస్థాయి సుబ్రతోముఖర్జీ టోర్నమెంట్‌లో ఈమె చక్కటి ప్రతిభ కనబరిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: