ఇంగ్లండ్ కి
న్యూజిలాండ్ కి మధ్య టీ ట్వంటీ మ్యాచులు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నాలుగు టీ ట్వంటీ మ్యాచులు జరగగా, తలో రెండు నెగ్గి మరో మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. శుక్రవారం జరిగిన నాల్గో టీ20లో ఇంగ్లండ్ 76 పరుగుల తేడాతో గెలిచింది. ఐదో
టీ20 ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. దాంతో ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.
అయితే ఈ మ్యాచ్ లో ఒకానొక అంశం అందరికీ ఆసక్తి కలగడంతో పాటు వైరల్ అయింది. ఈ ట్వంటీ ట్వంటీ మ్యాచులకి ఫోర్త్ అంపైర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గార్త్ స్టిరాట్ గురించి ఒక సంచలన విషయం తెలిసింది.
న్యూజిలాండ్ కు చెందిన గార్త్ స్టిరాట్ గతంలో నీలిచిత్రాల్లో నటించాడట. స్టీవ్ పార్నెల్ అనే పేరు మీద అతడు ఆ చిత్రాల్లో నటించాడట. ఈ విషయం
న్యూజిలాండ్ క్రికెటర్లందరికీ తెలుసు. వాళ్ళే ఇంగ్లండ్ ఆటగాళ్ళకి కూడా తెలియజేశారట.
పదేళ్ల క్రితం న్యూజిలాండ్ గోల్ఫ్ అసోసియేషన్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా కూడా స్టిరాట్ పని చేసిన స్టిరాట్, ఆ సమయంలో నీలిచిత్రాల్లో నటించి డబ్బు సంపాదించుకున్నాడట. అయితే ఈ విషయం బయట పడకూడదని చాలా రహస్యంగా ఉంచాడు. కానీ విషయం బయటకి రావడంతో అతని ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ పదవి ఊడిపోయింది. దాంతో ఆ తర్వాత క్రికెట్ అంపైర్గా అవతారం ఎత్తి సక్సెస్ అయ్యాడు.
పలు మహిళల
అంతర్జాతీయ మ్యాచ్లకు స్టిరాట్ అంపైర్గా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం ఫోర్త్ అంపైర్ గా కొనసాగుతున్న స్టిరాట్
సక్సెస్ ఫుల్ గా ఉన్నాడు. ఇంగ్లండ్ -
న్యూజిలాండ్ ల మ్యాచ్ లో ఈ అంశం వైరల్ గా మారింది.