ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న టీ - 20 సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్‌ తో నాగ్‌పూర్ వేదికగా ఆదివారం రాత్రి జరగనున్న విజేత నిర్ణయాత్మక ఆఖరి టీ - 20 కి భారత్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు టీ  - 20 ల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా ఢిల్లీ టీ - 20 లో బంగ్లాదేశ్, రాజ్‌ కోట్ టీ20లో భారత్ జట్టు విజయాన్ని అందుకున్నాయి. దీనితో సిరీస్ 1-1 తో సమమైన నేపథ్యంలో మూడో టీ - 20 పై ఉత్కంఠ నెలకొంది. భారత్‌ పై ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా బంగ్లాదేశ్‌ టీ - 20 సిరీస్ గెలవలేదు.


అయితే తొలి రెండు టీ - 20 ల్లోనూ పేలవ బౌలింగ్‌ తో విమర్శలు ఎదుర్కొన్న ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్‌ పై వేటు పడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. తొలి టీ - 20 లో తాను వేసిన ఆఖరి ఓవర్‌ లో చివరి నాలుగు బంతులకీ బౌండరీలు ఇచ్చిన ఖలీల్, రెండో టీ - 20లో తాను వేసిన తొలి ఓవర్‌లో మొదటి మూడు బంతులకీ ఫోర్లు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీనీతో ఖలీల్ బౌలింగ్‌ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. మూడో టీ - 20 లో అతనిపై వేటు వేసి శార్ధూల్ ఠాకూర్‌ ని జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మానేజ్మెంట్ చర్చించినట్లు తెలుస్తోంది.


బ్యాట్స్‌మెన్‌ గానే కాకుండా వికెట్ కీపర్‌ గా విఫలమైన రిషబ్ పంత్‌‌ ని మూడో టీ - 20లో రిజర్వ్ బెంచ్‌ పై కూర్చోబెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇటీవల భారీ స్కోర్లతో సూపర్ ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌‌‌ కి కనీసం ఆఖరి టీ - 20 లో నైనా ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనితో తొలి రెండు టీ - 20 ల్లోనూ రిజర్వ్ బెంచ్‌ కి పరిమితమైన శాంసన్‌ కి తుది జట్టులో చోటివ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక వేళ వికెట్ కీపర్‌ గా పంత్‌ని కొనసాగించాలనుకుంటే అప్పుడు కేఎల్ రాహుల్ లేదా శిఖర్ ధావన్‌పై వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే తుది జట్టులో కనీసం రెండు మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం.


మూడో టీ20కి భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ / సంజు శాంసన్, శివమ్ దూబే, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, చాహల్, శార్ధూల్ ఠాకూర్


మరింత సమాచారం తెలుసుకోండి: