ప్రపంచ వ్యాప్తంగా పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి విశేషమైన ప్రేక్షకుల ఆదరణ ఉంది. భారత క్రికెట్లో చెరగని ముద్ర వేసి తనదైన రీతిలో చెలరేగిపోతున్న కోహ్లి ఆటకు ఫిదా అవ్వని అభిమానులు ఉండరు. ప్రస్తుతం అదే జాబితాలో ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూతురు ఇవీమి కూడా చేరింది అంటే నమ్మండి. డేవిడ్ వార్నర్ కూడా మేటి క్రికెటరైనా కూడా కూతురు మాత్రం విరాట్ కోహ్లి పేరునే ఎప్పుడు తలుస్తూ ఉంటుంది అని వార్తలు వినిపిసితున్నాయి. ఈ విషయాన్ని వార్నర్
భార్య కాండైస్ వార్నర్ కూడా తెలియచేయడం జరిగింది.
తమ కూతురు తరచుగా ఐయామ్ విరాట్ కోహ్లి అంటూ జపం చేస్తుందని ఆమె తెలియచేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇవేమి బ్యాట్ పట్టుకుని బంతిని హిట్ చేసే సమయంలో ఐయామ్ విరాట్ కోహ్లి అంటున్న వీడియోను కాండైస్ షేర్ కూడా చేయడం జరిగింది. సరదాగా క్రికెట్ ఆడే సమయంలో ఐయామ్ కోహ్లి అంటూ ఉంటుందని ఇవీమి తల్లి తెలిపింది. ఈ విషయాన్ని కాండైస్ వార్నర్ తన ట్వీటర్ అకౌంట్లో కూడా అభిమానులకు అందరికి తెలియచేయడం జరిగింది. ఇక ఆ వీడియోకు మంచి క్యాప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. తమ చిన్నారి భారత్లో ఎక్కువ సమయం ఉండటంతో కోహ్లిలా ఉండాలనుకుంటుందని తెలియచేసారు ఆ పోస్టులో.
ఇక కోహ్లి ఐపీఎల్లో 177 మ్యాచ్ల్లో 5,412 పరుగులు చేసి టాప్లో ఉండగా, వార్నర్ నాల్గో స్థానంలో నిలవడం జరిగింది. ఐపీఎల్లో వార్నర్ 126 మ్యాచ్ల్లో 4,706 పరుగులు తీసాడు. 2014 నుంచి పరుగుల వీరుల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచిన వార్నర్.. 2015 ఐపీఎల్లో 562 పరుగులతో అగ్రస్థానాన్ని సాధించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక్కడ ఏబీ డివిలియర్స్, కోహ్లిల కంటే కూడా వార్నర్ అత్యధిక పరుగులు నమోదు కూడా చేయడం జరిగింది. నిషేధం కారణంగా 2018 ఐపీఎల్ సీజన్కు వార్నర్ దూరంగా ఉండగా, 2019లో 692 పరుగులతో మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.