తాజాగా జరిగిన దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీని ఆంధ్ర జట్టు ఓటమితో ముగించడం జరిగింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో సర్వీసెస్‌ చేతిలో ఓడిపోవడం జరిగింది. దీంతో టోర్నీలో మూడు విజయాలు, మూడు ఓటములతో 12 పాయింట్లు సాధించిన ఆంధ్ర... తమ గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి బయటికి రావడం జరిగింది. 


మొదటి బ్యాటింగ్‌ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో 7 వికెట్లు పడిపోయి 147 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఇక 27 పరుగులకే 3 వికెట్లు నష్టపోయి కష్టాల్లో ఉన్న జట్టును క్రాంతి కుమార్‌ (36 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్‌), నరేన్‌ రెడ్డి (23 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకోవడంతో మంచి స్కోర్ సాదించడం జరిగింది. ఛేదనకు దిగిన సర్వీసెస్‌ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేయడం జరిగింది.


ఇక రాహుల్‌ సింగ్‌ 23 బంతుల్లో 41 పరుగులు  దూకుడుగా ఆటలో ముందుకు కొనసాగాడు. ఆంధ్ర బౌలర్‌ శశికాంత్‌ (3/32) కూడా సాధించడం జరిగింది. చండీగఢ్‌ వేదికగా జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 21 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై విజయం సొంతం చేసుకోవడం జరిగిది. మొదట హైదరాబాద్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు సాధించగా... అనంతరం ఛత్తీస్‌గఢ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకోలేక పోయింది.

తమ లీగ్‌ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ 16 పాయింట్లతో ... పంజాబ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రైల్వేస్‌లతో సమానంగా నిలవడం జరిగింది. అయితే మెరుగైన రన్‌రేట్‌ లేకపోవడంతో సూపర్‌లీగ్‌ దశకు అర్హతను కోల్పోవడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: