ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి సారి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ గెల్చుకొని చరిత్ర సృష్టించింది భారత్. మూడు రోజులు కూడా సాగని ఈ మ్యాచ్ లో ఇన్నింగ్స్ 46పరుగులతో ఓడిపోయి అవమానకర రీతిలో పర్యటనను ముగించింది బంగ్లాదేశ్. ఇరు జట్ల మధ్య టీ 20 సిరీస్ రసవత్తరంగా జరుగుగా .. టెస్టు సిరీస్ మాత్రం ఏకపక్షంగా సాగింది.. ఫలితంగా బంగ్లా టెస్టు సిరీస్ లో 2-0 తో భారత్ చేతిలో వైట్ వాష్ కు గురైయింది.
ఇక కోల్ కత్తా టెస్టు గెలిచిన అనంతరం టీమిండియా సారథి
విరాట్ కోహ్లీ చేసిన పనికి క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. గంగూలీ , నజముల్ హాసన్ ల చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్న కోహ్లీ వెంటనే దాన్ని యువవికెట్ కీపర్ , తెలుగు తేజం కేఎస్
భరత్ కు అందించాడు. నిజానికి భరత్ , బంగ్లా తో టెస్టు సిరీస్ కు ఎంపిక కాలేదు. కానీ సాహా కు బ్యాక్ అప్ ఉంచడానికి మేనేజ్మెంట్ చివరి నిమిషంలో భరత్ ను రప్పించింది. నిన్న భరత్ టీం తో చేరాడు.
ఇక ఈ సిరీస్ విజయం తో భారత్ ప్రపంచ టెస్టు
ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 360 పాయింట్ల తో ఎవరికి అంతనంద దూరాన నిలిచింది. ఈ
ఛాంపియన్ షిప్ ట్రోఫీ లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోతుంది టీమిండియా.