తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్తో తేడాతో గెలిచిన సంగతి అందరికి తెలిసిందే కదా. చారిత్రక టెస్టులో భారత్ సత్తా చాటడంతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేయడం జరిగింది. మూడు రోజుల్లోనే పింక్ బాల్ టెస్టు ముగియడంతో భారత జట్టు సభ్యులు సోమవారం ముంబైకు చేరుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్లో దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భార్య అనుష్క శర్మ ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. కోహ్లి రాకకోసం ఎయిర్పోర్ట్కు వెళ్లిన అనుష్క భర్తను స్వయంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది.
భర్త కోహ్లిని చూసిన వెంటనే అనుష్క ఆనందంలో మునిగి పోయింది అంటే నమ్మండి. వీరు ఇంటికి చేరుకునే క్రమంలో కారులో బయల్దేరగా, కోహ్లి ఒడిలో అనుష్క వాలి పోవడం జరిగింది. భర్తను గట్టిగా హగ్ చేసుకుని బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేసింది అనుష్క . ఇక దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. వీరు ఎప్పుడు ఖాళీ దొరికినా తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతారు. తమ షెడ్యూల్ను బట్టి ట్రిప్లు ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. ఇటీవల భూటాన్లో విహరించిన ఈ జంట.. వాటికి సంబంధించి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానుల్ని వారు అక్కటుకోవడం జరుగుతుంది. తాజాగా కోహ్లి- అనుష్కలు ఇంటికి చేరుకునే క్రమంలో బహిరంగంగా ప్రేమను ఇలా వ్యక్తం చేయడం ఫ్యాన్స్లో మంచి జోష్ను తీసుకొని రావడం జరిగింది.
కోహ్లి- అనుష్కలు ఎప్పుడు సరదాగా బాగా గడుపుతారు. కోహ్లికి చారిత్రక టెస్టులో విజయం ఒక మంచి కానుకగా చెప్పవచ్చు. ఇక ఈ ఫొటోస్ కి మంచి స్పందన లభించింది. ముంబైలో కోహ్లి రాకకోసం చాల మంది అభిమానులు ఎదురుకుడా చూడడం జరిగింది.