కేవలంమూడు , నాలుగు మ్యాచ్ లలో ఫెయిల్ అయినందుకు ఫ్రాంచైజీ నన్ను భారం అనుకుంటుందని కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని మాజీ విండీస్ క్రికెటర్ , విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా లో జరుగుతున్న ఏం ఎస్ ఎల్ లీగ్ లో తేష్వనే స్పార్టాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్ ఆరు మ్యాచ్ ల్లో కలిపి ఈ సీజన్ లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దాంతో ఫ్రాంచైజీ గేల్ ను పట్టించుకోవడం మానేసింది.
పొట్టి ఫార్మట్ లీగ్ ల్లో క్రిస్ గేల్ ఓ లెజెండ్ ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్ , తదితర లీగుల్లో తానేంటో నిరూపించుకున్నాడు. దాదాపు అన్ని లీగు ల్లో గేల్ సక్సెస్ అవుతూ వస్తున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఏం ఎస్ ఎల్ టోర్నమెంట్ లో మాత్రం గేల్ దారుణంగా నిరాశపరిచాడు. దాంతో అటు ఫ్రాంచైజీ , అభిమానులు కూడా తనను లెక్క చేయడం లేదని , కేవలం మూడు , నాలుగు మ్యాచ్ ల్లో విఫలమైతే జట్టుకు నేను భారంగా కనిపిస్తున్నాను. కొన్నేళ్లుగా ఫ్రాంచైజీ క్రికెట్ లో ఈపరిస్థితి ని గమనిస్తున్నాను. మూడు , నాలుగు మ్యాచ్ లో నేను స్కోర్ చేయలేకపోతే నా పని అయిపోయిందనుకుంటున్నారు. ప్రజలు కూడా నన్ను గుర్తుంచుకోవడం లేదు నాకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని గేల్ మీడియా ముందు వాపోయాడు.