వచ్చే ఏడాది  జనవరి -ఫిబ్రవరి లో సౌత్ ఆఫ్రికా లో జరుగనున్న అండర్ 19ప్రపంచ కప్ కోసం 15మంది ఆటగాళ్లతో కూడిన  భారత జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ.  ఈ జాబితాలో  చోటు సంపాదించుకున్నాడు  హైదరాబాదీ  యువ బ్యాట్స్ మెన్  తిలక్ వర్మ.  ఇప్పటికే  ఈ 17ఏళ్ళ  ఎడమ చేతివాటం  ఓపెనర్   హైదరాబాద్  జట్టు  తరుపున   బరిలోకి దిగి  పలు రికార్డులు సృష్టించాడు.  ఇక తిలక్ తోపాటు  ఇటీవల లిస్ట్ ఏ క్రికెట్ లో ప్రపంచరికార్డు నెలకొల్పిన  ముంబై  ఆటగాడు యశస్వి జైస్వాల్   కూడా అండర్ 19 ప్రపంచ కప్ లో చోటు  దక్కించుకున్నాడు.  ఉత్తర ప్రదేశ్ బ్యాట్స్ మెన్  ప్రియమ్  గార్గ్ భారత జట్టుకు  కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.  
 
 
అండర్ 19  ప్రపంచ కప్ కు ఎంపికైన  భారత జట్టు : 
 
ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ ,దివ్యాన్ష్ సక్సేనా ,ధృవ్ చంద్ జురెల్ ( వైస్ కెప్టెన్ &వికెట్ కీపర్),శశ్వత్ రావత్ ,దివ్యాన్ష్ జోషి ,శుబాంగ్ హెగ్డే ,రవి బిష్ణోయ్ ,ఆకాష్ సింఘ్,కార్తిక్  త్యాగి ,అథర్వ అంకోలేకర్ ,కుమార్ కుషాగ్ర , ,సుశాంత్ మిశ్రా , విద్యాధర్ పాటిల్. 

మరింత సమాచారం తెలుసుకోండి: