వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్ కత్తా లో ఐపీఎల్ వేలం జరుగనుంది. ఎనిమిది జట్లలో మొత్తం 73 బెర్తుల కోసం నిర్వాహకులు ఈ వేలంను నిర్వహించనున్నారు. నవంబర్ 30 తో ఈ వేలం లో పాల్గొనే ప్లేయర్ల నమోదు ప్రక్రియ ముగిసింది. రికార్డు స్థాయిలో ఈ వేలంలో 971మంది ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారు. ఇందులో 713 మంది భారత ప్లేయర్లు ఉండగా 215మంది విదేశీ ప్లేయర్లు వున్నారు.
ఇక ఈ వేలం నుండి ఇద్దరు స్టార్ క్రికెటర్లు తప్పుకున్నారు. అందులో మొదటి వాడు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్. ప్రపంచ కప్ , యాషెస్ సిరీస్ ను ద్రుష్టి లో పెట్టుకొని గత సీజన్ వేలానికి కూడా దూరంగా వున్న స్టార్క్ ఈసారి కూడా ఈ ఆక్షన్ నుండి తప్పుకున్నాడు. ఒక వేళా స్టార్క్ గనుక వేలంలో అందుబాటులో ఉండి ఉంటే ప్రాంచైజీలూ కోట్లు కుమ్మరించి అతన్ని సొంతం చేసుకునేవి. ఇక స్టార్క్ తోపాటు
ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ కూడా ఈ వేలం నుండి తప్పుకున్నాడు.