చంద్రయాన్ 2 ప్రయోగం లో భాగంగా కనబడకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ జాడను తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కనిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐపీఎల్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు నాసా కు ఓ వింత రిక్వెస్ట్ పెట్టింది. నాసా టీం.. విక్రమ్ ల్యాండర్ జాడను కనిపెట్టినట్లుగా మా బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ , కోహ్లీ కొట్టిన బంతులను కూడా కనిపెట్టడంలో మాకు సాయం చేయండి అని ట్వీట్ చేసింది.
ఇక ఈ ట్వీట్ పై నెటిజన్ల తోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. ముందు మీరు ఐపీఎల్ ట్రోఫీని ఎలా గెలవాలో మార్గాలు కనిపెట్టుకోండి, ఇలాంటివన్నీ తరువాత అని కొందరు కామెంట్లు చేయగా ఈసారైనా మంచి బౌలర్లను కొనుక్కొని కప్ గెలవడానికి ప్రయత్నించండి అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ ని ముద్దడాలేకపోయింది ఆర్సీబీ. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు వున్నా కూడా బౌలింగ్ బలహీనత తో ఓటములను చవి చూస్తుంది. దాంతో వచ్చే సీజన్ కోసం జరుగనున్న వేలంలో స్టార్ బౌలర్లను దక్కించుకోవాలని ఆర్సీబీ పట్టుదలతో వుంది.