బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్  2020 ఐపీఎల్  సీజన్ కోసం  జరుగనున్న వేలం నుండి  తప్పుకున్నాడు.  గత ఏడాది  50లక్షల బేస్ ప్రైస్ తో వేలం లోకి వచ్చిన  రహీమ్  కు నిరాశే ఎదురైంది.  ఒక్క ప్రాంచైజీ కూడా  రహీమ్ ను సొంతం చేసుకోవడానికి  ఆసక్తిని చూపించలేదు. ఇక ఈ సారి కూడా అదే సీన్  రిపీట్ అవుతుందేమోనని రహీమ్  వేలానికి  ముందే  తప్పుకున్నాడు. ఇటీవల ఢిల్లీ  లో జరిగిన  టీ 20 లో వీరోచితంగా పోరాడి తమ జట్టుకు టీ 20 ల్లో ఇండియా పై తొలి విజయాన్ని అందించాడు ముష్ఫికర్ రహీమ్.  
 
 
ఇక  కోల్ కత్తా లో ఈనెల  19న వచ్చే ఐపీఎల్  సీజన్ కోసం వేలం జరుగనుండగా  బంగ్లాదేశ్  నుండి  ఆరుగురు ఆటగాళ్లు  తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  అందులో  భాగంగా  ముస్తాఫిజుర్ రెహమాన్ , మహమ్మదుల్లా , మెహదీ హాసన్ మిరాజ్ , సౌమ్య సర్కార్ , తమీమ్ ఇక్బల్ ,తస్మిన్ అహ్మద్ లు వేలానికి అందుబాటులో ఉండనున్నారు. వీరిలో  ముస్తాఫిజుర్ తప్ప  మిగితా వారు  అమ్ముడుపోవడం  డౌటే..  

మరింత సమాచారం తెలుసుకోండి: