నేడు హైదరాబాద్‌లో క్రికెట్ సందడి మొదలు అయంది. నేడు సాయంత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో ఇండియా వర్సెస్  వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది . నేడు రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు అవుతుంది. ఇప్పటికే  టీ20 మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.స్టేడియం పరిసరాల్లో 1800 పోలీసులతో  రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో   కట్టుదిట్టమైన  భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. 

 

నేడు బ్లాక్ డే నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా స్టేడియం వద్ద బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్టోపస్, ట్రాఫిక్ పోలీసులు, సిసి కెమెరాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు, డాగ్ స్క్వాడ్ టీం ఇందులో ఉంటారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలియచేయడం జరిగింది. అభిమానులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు.

 

ఇక భద్రతా కారణాల దృష్ట్యాల దృష్టిలో పెట్టుకొని  ఉప్పల్ స్టేడియంలోనికి సిగరెట్లు, ల్యాప్ టాప్స్, హెల్మెట్లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బైనాకులర్స్, బ్యాగ్స్, బ్యానర్స్, లైటర్స్, కాయిన్స్, తిండి పదార్థాలు, ఫర్ ఫ్యూమ్స్‌కు తీసుకొని రాకూడదు అని తెలియచేయడం జరిగింది. ఒక్క జాతీయ జెండాలు తప్ప ఇతర ఎలాంటి జెండాలను కూడా స్టేడియం లోకి తీసుకొని రాకూడదు అని తెలిపారు. మరో వైపు మహిళల భద్రత దృష్టిలో ఉంచుకొని స్టేడియం లోపల షీం టీమ్స్ కూడా ఉంటాయి అని పోలీసులు తెలిపారు. 

 

స్టేడియం మొత్తం సీసీ కెమెరాల ఆధీనంలో ఉంటుంది. ఒక  వేళా అనుకోని  తక్షణ వైద్య సేవల కోసం 3 -8 అంబులెన్స్‌లు, 4-5 ఫైరింజన్లను అందుబాటులో కూడా ఉంచడం జరిగింది. మ్యాచ్ నేపథ్యంలో ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు కూడా నడుపుతారు అని అధికారులు తెలియ చేశారు. ఇక దొంగతనాలు లాంటి సంఘటనలు లేదా ఎవరికైనా ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా డయల్ 100 కి ఫోన్ చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలియచేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: