27బంతుల్లో 50..  మెరుపు ఇన్నింగ్స్  ఆడిన  శివమ్ దూబే 

 
 
టీమిండియా  యంగ్ క్రికెటర్  శివమ్ దూబే కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు.  త్రివేండ్రం  వేదికగా  వెస్టిండీస్ -భారత్ మధ్య జరుగుతున్న రెండో టీ 20 లో దూబే ఈ ఫీట్ సాధించాడు.  ఈ మ్యాచ్ లో  వన్ డౌన్ లో  వచ్చిన  దూబే  30బంతుల్లో  4సిక్సర్లు , 3ఫోర్ల సాయంతో  54పరుగులు చేశాడు. ఈక్రమంలో  మరింత దూకుడుగా ఆడే క్రమంలో  అతను ,వాల్ష్  బౌలింగ్ లో హేట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
అంతకుముందు  పోలార్డ్ వేసిన 9 ఓవర్ లో  మూడు సిక్సర్ల తో  అదరగొట్టాడు  శివమ్ దూబే. మొత్తానికి  దూబే ను  మూడో స్థానం లో చేసిన ప్రయోగం  ఫలించింది. ఈ ఇన్నింగ్స్ దూబే కెరీర్ నుమలుపు తిప్పిన  ఆశ్ఛర్యపోనక్కర్లేదు. ఇక టాస్ ఓడిపోయి  బ్యాటింగ్ కు దిగిన  భారత్ కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు.  మొదటి మ్యాచ్ లో 62 పరుగులతో అదరగగొట్టిన  కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో తక్కువ పరుగులకే  పెవిలియన్ చేరాడు. కాగా   గత మ్యాచ్ లో  నిరాశపరిచిన రోహిత్ శర్మ  ఈమ్యాచ్ లో కూడా అదే  ఫామ్ ను కొనసాగించాడు.  వీరికి తోపాటు కెప్టెన్ కోహ్లి కూడా తొందరగానే ఔటయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్  క్రీజ్ లో కొనసాగుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: