టీమిండియా సిరీస్ తొలి టీ20లో పర్యాటక వెస్టిండీస్ జట్టుపై ఘన విజయం సాధించినది.అందుకుగాను టీమిండియా సిరీస్పై కన్నేసింది. రెండో టీ20 ఆదివారం స్థానిక మైదానంలో జరగనుంది ఐతే రెండో టీ20లో తప్పక గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. కోహ్లి సేన దీనికోసం పక్కా ప్రణాళికలు రచిస్తోంది . కొన్ని లోపాలు తొలి మ్యాచ్లో గెలిచినప్పటికీ భయటపడ్డాయి. హైదరాబాద్ టీ20లో బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఫీల్డింగ్ టీమ్ మేనేజ్మెంట్ చెత్త గా ఉండటం వల్ల కలవరపెడుతోంది.
దీంతో రెండో మ్యాచ్లో ఈ లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు మేనేజ్మెంట్ జట్టులోనూ పలు మార్పులు చేయాలని భావిస్తోంది. అయితే విన్నింగ్ టీమ్ మార్చడానికి వీలులేదన్న నిబంధనలను రూపొందించుకున్నప్పటికీ ఇప్పుడు మార్పులు తప్పేలా లేవని సమాచారం. ఎలాంటి మార్పులుబ్యాటింగ్ విభాగంలో లేవని తెలుస్తోంది. అయితే టీమ్ మేనేజ్మెంట్ బౌలింగ్ విభాగంపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది.
భువనేశ్వర్ పునరాగమనం మ్యాచ్లో తేలిపోయాడు. దీపక్ చహర్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ విఫలమయ్యాడు. బౌలింగ్లో ఫీల్డింగ్లో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పూర్తిగా నిరుత్సాహపరిచాడు. దీంతో భువీ, చహర్లలో ఒకరిని పక్కకు పెట్టి మహ్మద్ షమీని తీసుకోవాలని భావిస్తున్నారు. అదేవిధంగా జట్టు నుంచి వాషింగ్టన్ సుందర్ను తప్పించి కుల్దీప్ యాదవ్కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.
ఇక మేనేజ్మెంట్ ఫీల్డింగ్ వైఫల్యంపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఫీల్డింగ్ కోసం ఆదివారం జరిగిన నెట్ ప్రాక్టీస్లో ఓ సెషన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక రోహిత్ శర్మ తొలి మ్యాచ్లో ఎక్కువగా క్యాచ్లు నేలపాలు చేసాడు దింతో ప్రాక్టీస్ సెషన్లో ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక డ్రిల్లో మిగతా టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇక కరీబియన్లు కూడా తొలి మ్యాచ్ వైఫల్యాలను గుర్తించి సరిదిద్దుకోని తిరువనంతపురం మ్యాచ్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.