ఇటీవల  వెస్టిండీస్ తో జరిగిన  టీ 20 సిరీస్ లో  మూడు మ్యాచుల్లో టాస్  ఓడిపోయిన  టీమిండియా  కెప్టెన్  విరాట్ కోహ్లి .. వన్డే సిరీస్ లో  కూడా  అదే రిపీట్ చేశాడు.  అందులో భాగంగా  ఈరోజు  చెన్నైలోని  చెపాక్ వేదికగా  భారత్ -వెస్టిండీస్ లమధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగనుంది.  ఇక ఈ మ్యాచ్ లో  విండీస్ టాస్ గెలిచి  ఫిల్డింగ్  ఎంచుకుంది. స్పిన్ పిచ్ కావడంతో  భారత్ కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగనుంది.  రోహిత్ శర్మ తోకలిసి రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. 
 
భారత జట్టు : లోకేష్ రాహుల్ , రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి, శ్రేయాస్  అయ్యర్ , రిషబ్ పంత్ , కేదార్ జాదవ్ , శివమ్ దూబే , రవీంద్ర జడేజా , కుల్దీప్ యాదవ్ , దీపక్ చాహర్ ,షమీ 
 
వెస్టిండీస్ జట్టు : శాయ్ హోప్ , సునీల్ అంబ్రీస్ , కిరెన్ పోలార్డ్ , రోస్టన్ ఛేజ్ ,హెట్ మెయర్ , పూరన్ , హోల్డర్ ,కీమో పాల్ , హేడెన్ వాల్ష్ , అల్జారీ జోసెఫ్ ,కాట్రేల్ 
 

మరింత సమాచారం తెలుసుకోండి: