టాలీవుడ్ నటి క్రికెట్ ఆడుతూ కొత్త సంవత్సరానికి సూచికగా వినూత్నంగా వెల్‌ కమ్ చెప్పింది.  ఆమె క్రికెట్ వీడియో షాట్‌ ను చూసిన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మెచ్చుకుంటూ కామెంట్  చేయడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ వైరల్ అయింది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో పై లైకులు, కామెంట్లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అసలు క్రికెట్ ఆడిన ఆ సినీనటి ఎవరంటే సయామీ ఖేర్.. మెగా ఫ్యామిలీకి చెందిన సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ అరంగేట్ర మూవీలో సాయి ధరమ్ తేజ్ సరసన రేయ్‌ లో ఆమె నటించింది.   
 

ఇక సయామీ క్రికెట్ ఆడిన వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చక్కని షాట్ ఆడుతూ.. న్యూ ఇయర్‌ కు వెల్‌ కమ్ చెప్పింది. ప్రొఫెషనల్ ప్లేయర్ తరహాలో సయామీ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ అద్భుతంగా ఉంది. ఈ వీడియోను చూసిన యూవీ తనదైన శైలిలో స్పందించాడు. షాట్ బడ్డీ అంటూ ఒక స్మైల్, లైక్ సింబల్‌ తో ఆనందం వ్యక్తం చేశాడు.
 

ఇక పొతే నెటిజన్లు కూడా వీడియో చూసి లైక్స్, కామెంట్స్ తెగ చేసేస్తున్నారు మరి. మరోవైపు నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులకు యువరాజ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ కొత్త దశాబ్ధపు శుభాకాంక్షలు అంటూ.. ఈ నూతన సంవత్సరంలో అందరికీ ప్రేమ, శాంతి, ఆనందం, మంచి ఆరోగ్యం కలగాలిన కోరుకుంటున్నా. మనం కావాలనుకున్న మార్పుకై పాటుపడదాం. ఇతరుల్లోని మంచిని వెలికి తీసి, వారిలో స్ఫూర్తినింపుదాం అంటూ యూవీ ట్వీట్ చేశాడు. 


గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన యూవీ ప్రస్తుతం టీ10 లీగ్‌ లో ఆడుతున్నాడు. మరాఠా అరేబియన్స్ జట్టు కెప్టెన్‌ గా వ్యవహరించి టీమ్‌ కు టైటిల్ అందించాడు యువరాజ్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: