ఈనెల లో బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించాల్సి వుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టు తో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ తో పాటు రెండు టెస్టులు కూడా ఆడాల్సి వుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా బీసీబీ
టీ 20 సిరీస్ మాత్రమే ఆడుతామని తేల్చిచెప్పింది. పాక్ కు కూడా అందుకు అంగీకరించింది. దాంతో ఈనెల 24,25,27 న లాహోర్ వేదికగా ఈ మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ జరుగనుంది. ఈ పర్యటనకు బంగ్లా స్టార్ బ్యాట్స్ మెన్ , వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ దూరంగా వున్నాడు. తన కుటుంభ సభ్యుల కోరిక మేరకే నేను ఈపర్యటన నుండి తప్పుకుంటున్నాను, నేను
పాక్ వెళ్లడం మా వాళ్లకు ఇష్టం లేదు.. వారిని బాధ పెట్టకూడదనే ఈనిర్ణయం తీసుకున్నానని ముష్ఫికర్, బీసీబీకి రాసిన
లేఖ లో పేర్కొన్నాడు.