గత కొంత కాలంగా స్వదేశంలో వరస విజయాల తో దూసుకుపోతున్న టీమిండియా తాజాగా విదేశీ గడ్డపై కూడా వరస విజయాలను సాధిస్తూ ఇంట కాదు బయట కూడా తామేంటో నిరూపించింది. అందులో భాగంగా
న్యూజిలాండ్ తో జరుగుతున్న 5మ్యాచ్ ల టీ 20 సిరీస్ ను మరో రెండు మ్యాచ్ లు మిలిగి ఉండగానే 3-0 తో గెలుచుకుంది. ఇక టీమిండియా ద్రుష్టి ఇప్పుడు క్లీన్ స్వీప్ పై పడింది. ఎలాగైనా సిరీస్ ను 5-0 తో వైట్ వాష్ చేసి
న్యూజిలాండ్ గడ్డపై
చరిత్ర సృష్టించాలని
భారత్ ఉవ్విళ్లూరుతోంది.