ట్రై సిరీస్ లో భాగంగా భారత మహిళా జట్టు , ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ నేడు కాన్ బెర్రా లో జరుగుతుంది. ఈమ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ప్రస్తుతం 17ఓవర్ల లో ఇంగ్లాండ్ 4వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. భారత్ , ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా మధ్య ఈ టీ 20ట్రై సిరీస్ జరుగుతుంది.
ఇక భారత పురుషుల జట్టు నేడు న్యూజిలాండ్ పురుషుల జట్టుతో నాలుగో టీ 20 లో తలపడనుంది. 5మ్యాచ్ ల టీ 20సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3-0 తో సిరీస్ ను కైవసం చేసుకోవడంతో నాలుగో మ్యాచ్ లో ప్రయోగాలు చేసేందుకు టీమిండియా సిద్ద మవుతుంది. అందులో భాగంగా తుది జట్టులో రెండు లేదా మూడు మార్పులు చేయనుంది. మరోవైపు సొంతగడ్డపై ఇప్పటికే సిరీస్ ను చేజార్చుకున్న కివీస్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుంది. వెల్లింగ్టన్ లో ఈమ్యాచ్ ఈరోజు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుంది.