న్యూజిలాండ్ తో  ఈనెల 21నుండి  జరుగనున్న టెస్ట్ సిరీస్ నుండి తప్పుకున్నాడు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య. గత ఏడాది సెప్టెంబర్ లో సౌతాఫ్రికా తో  జరిగిన టీ 20మ్యాచ్ తరువాత వెన్నుముఖ గాయం బారిన పడ్డ  హర్దిక్..  అక్టోబర్ లో  శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.  దాంతో అతను  అప్పటినుండి క్రికెట్ కు దూరంగా వున్నా.. ఇటీవల కోలుకొని  మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. అయితే  కివీస్ తో పరిమిత ఓవర్ల  సిరీస్ లకు  ఎంపికై హార్దిక్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తాడనుకుంటే  ఫిట్ నెస్ టెస్టు, లో విఫలం కావడం తో అతన్ని ఎంపిక చేయలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఫిట్ నెస్ పరీక్షలో విఫలం కావడం తో హార్దిక్ టెస్టు సిరీస్ కు కూడా  దూరం అయ్యాడు. 
 
ఇక హార్దిక్  పాండ్య తిరిగి పూర్తి ఫిట్  నెస్ సంతరించుకొనే వరకు జాతీయ క్రికెట్ అకాడమీ  లో శిక్షణ తీసుకోనున్నాడు.  ఇదిలావుంటేన్యూజిలాండ్  పర్యటనలో  భాగంగా  ప్రస్తుతం ఆతిథ్య జట్టు తో  భారత జట్టు టీ 20సిరీస్ లో తలపడుతుంది.  5మ్యాచ్ ల ఈ సిరీస్ లో  భారత్ ప్రస్తుతం   4-0 తో ఆధిక్యంలో కొనసాగుతుంది. రేపు ఇరుజట్ల మధ్య చివరి టీ 20 జరుగనుంది.  ఈమ్యాచ్  తరువాత  ఇరు జట్ల మధ్య ఈనెల 5నుండి వన్డే సిరీస్ స్టార్ట్ కానుంది. కాగా ఈ సిరీస్ కు బీసీసీఐ ,భారత జట్టును ప్రకటించినప్పటికీ  టెస్టు సిరీస్ కు మాత్రం ఇంకా  జట్టును ఎంపికచేయాల్సివుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: