ప్రస్తుతం టీమిండియా లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేఎల్ రాహుల్. టీమిండియా ఎలాంటి ఫార్మాట్ లో ఆడుతున్న ప్రత్యర్థి ఎవరైనా ఎక్కువగా ఈ ఆటగాడి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కె.ఎల్.రాహుల్ కెరీర్లోనే ది బెస్ట్ ఫామ్ లో కొనసాగుతూ అద్భుత ఆటతీరును కనబరుస్తూ ఉన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియా విజయం సాధించిన ఓటమిపాలైన అందులో కె.ఎల్.రాహుల్ ప్రదర్శనకు మాత్రం  ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక టీమిండియాలో కీలక బ్యాట్స్ మెన్ గా మారిపోయాడు కేఎల్ రాహుల్. ఓవైపు కీపర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు కీలక బ్యాట్ మెన్ గా తన సత్తా చాటుతూ అద్భుత స్కోరును నమోదు చేస్తూ సంచలన రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఇక రాహుల్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కూడా కురుస్తున్న విషయం తెలిసిందే. 

 

 మొన్నటికి మొన్న న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో రాహుల్ ఐదవ స్థానంలో బ్యాటింగ్కు దిగిన వేగంగా సెంచరీ చేసి ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అయితే మూడో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా ఓటమి పాలైన...ఇప్పటికీ రాహుల్ ఆడిన కళాత్మకమైన ఇన్నింగ్స్ పై  మాత్రం ఇప్పటికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ఏకంగా 113 బాలల్లో 112 రంగులు చేసి అజేయంగా నిలిచాడు కేఎల్ రాహుల్.ఈ సెంచరీ ఎందుకు అంత స్పెషల్ అంటే... 5వ స్థానంలో వచ్చిన బ్యాట్ మెన్  వంద పరుగులు చేయడం అనేది మామూలు విషయం కాదు.  కానీ రాహుల్ మాత్రం తన కళాత్మకమైన బ్యాటింగ్ తో అద్భుతం ప్రదర్శన చేస్తూ సెంచరీ సాధించాడు. 

 

 అయితే కె.ఎల్.రాహుల్ ఆటతీరుపై ఇప్పటికే ఎన్నో ప్రశంసలు కురుస్తున్న  విషయం తెలిసిందే. ఇక తాజాగా టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. కేఎల్ రాహుల్ న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో సెంచరీ సాధించి అజేయంగా నిలిచిన నేపథ్యంలో టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఇంస్టాగ్రామ్ వేదిక రాహుల్ ప్రదర్శనను కొనియాడారు. కివీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు బ్రో. నీ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజిలో ఉంది ఇలానే విధ్వంసాన్ని కొనసాగిస్తే నువ్వు 12వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన సెంచరీ తప్పక సాధిస్తావ్ అనే క్యాప్షన్తో ఈ ఫోటోని షేర్ చేశాడు. శిఖర్ ధావన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా బ్యాటింగ్ ఆర్డర్ తో సంబంధం లేకుండా చెలరేగి పోతున్నాడు అంటూ అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: