ఐపీఎల్ లో అత్యంత ప్రజాదరణ కలిగిన జట్ల లో
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఒకటి. సీజన్లు మారుతున్న కానీ ఒక్కసారి కూడా ట్రోఫీ విజేతగా నిలువలేకపోయింది అయినా కూడా ఆజట్టుకు ఫ్యాన్స్ సపోర్ట్ అంతా ఇంతకాదు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా సన్ రైజర్స్
హైదరాబాద్ తరువాత ఎక్కువ మంది ఇష్టపడేది ఆర్సీబీనే.. అయితే స్టార్ ప్లేయర్ల తో నిండిన కూడా అదృష్టం కలిసి రాకపోవడం తో ఇప్పటివరకు ఆర్సీబీ ఒక్క సారి కూడా
ఛాంపియన్ గా అవతరించలేదు. దాంతో ఈ సీజన్ కోసం ఆర్సీబీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవల జరిగిన వేలంలో మరి కొంత మంది స్టార్ ప్లేయర్లను దక్కించుకోవడంతో ప్రస్తుతం ఆ జట్టు చాలా బలంగా కనిపిస్తుంది దానికి తోడు ఇన్ని రోజులు తమకు అచ్చి రాని జట్టు పేరును , లోగో మార్చడానికి యాజమాన్యం నిర్ణయించుకుంది. రేపు బెంగుళూరు టీంకొత్త పేరు తోపాటు లోగో ను ప్రకటించనున్నారు. వీటితోపాటు ఆటగాళ్ల
జెర్సీ కూడా మారనుందని సమాచారం. మరి ఈసారైనా బెంగుళూరు కు అదృష్టం కలిసొస్తుందో చూడాలి. కాగా ఐపీఎల్ 13వ సీజన్
మార్చి 29న ప్రారంభమై మే 24తో ముగియనుంది.
బెంగుళూరు జట్టు :
విరాట్ కోహ్లీ(కెప్టెన్),పార్థివ్
పటేల్, ఏబీ డివిలియర్స్ ,
శివమ్ దూబే ,క్రిస్ మోరిస్ ,మొయిన్
అలీ ,జోష్ ఫిలిప్ , ఆరోన్ ఫించ్ ,సిరాజ్ ,షాబాజ్
అహ్మద్ ,యుజ్వేంద్ర చాహల్,నవదీప్ సైని,ఇసురు ఉదాన ,డేల్ స్టెయిన్,పవన్ నేగి ,దేవదూత్ పడిక్కాల్,ఉమేష్ యాదవ్ ,గురుకీరత్ మాన్ సింగ్ ,వాషింగ్టన్
సుందర్,పవన్ దేశ్ పాండే, కేన్
రిచర్డ్ సన్.